పీఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్.. గెలుపు క్రెడిట్ ద్రావిడ్కు ఇచ్చిన పాక్ ప్లేయర్
- పీఎస్ఎల్ ఎలిమినేటర్లో ఇస్లామాబాద్పై హైదరాబాద్ కింగ్స్మెన్ విజయం
- రెండు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరిన హైదరాబాద్ జట్టు
- విజయం తర్వాత టీమిండియా మాజీ కోచ్ ద్రావిడ్ను గుర్తు చేసుకున్న పాక్ బౌలర్
- కష్టపడితే అదృష్టం వరిస్తుందన్న ద్రావిడ్ మాటలు స్ఫూర్తినిచ్చాయన్న మహ్మద్ అలీ
- రేపు ఫైనల్లో పెషావర్ జల్మీతో తలపడనున్న హైదరాబాద్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ (పాకిస్థాన్) కింగ్స్మెన్ జట్టు థ్రిల్లింగ్ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు పేసర్ మహ్మద్ అలీ.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ను గుర్తుచేసుకున్నాడు. ఆయన మాటలే తమకు స్ఫూర్తినిచ్చాయని చెప్పి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
శుక్రవారం జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్పై హైదరాబాద్ కింగ్స్మెన్ 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ గెలుపుతో మార్నస్ లబుషేన్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇస్లామాబాద్ పోరాడినా, చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.
మ్యాచ్ అనంతరం రెండు వికెట్లు పడగొట్టిన మహ్మద్ అలీ మాట్లాడాడు. తాను ఒక ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చి నిరాశపడ్డానని, కానీ తన సహచర బౌలర్ హునైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. గతంలో ఓ మ్యాచ్లో చివరి ఓవర్లో పరుగులు కాపాడలేక హునైన్ విఫలమయ్యాడని, కానీ ఈసారి ఒత్తిడిని జయించాడని అన్నాడు. "గొప్ప ఆటగాడు రాహుల్ ద్రావిడ్ చెప్పినట్లుగా, కష్టపడి పనిచేసే వారినే అదృష్టం వరిస్తుంది" అని అలీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ గెలుపుతో హైదరాబాద్ రేపు జరిగే ఫైనల్లో పెషావర్ జల్మీతో తలపడనుంది.
శుక్రవారం జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్పై హైదరాబాద్ కింగ్స్మెన్ 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ గెలుపుతో మార్నస్ లబుషేన్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇస్లామాబాద్ పోరాడినా, చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.
మ్యాచ్ అనంతరం రెండు వికెట్లు పడగొట్టిన మహ్మద్ అలీ మాట్లాడాడు. తాను ఒక ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చి నిరాశపడ్డానని, కానీ తన సహచర బౌలర్ హునైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. గతంలో ఓ మ్యాచ్లో చివరి ఓవర్లో పరుగులు కాపాడలేక హునైన్ విఫలమయ్యాడని, కానీ ఈసారి ఒత్తిడిని జయించాడని అన్నాడు. "గొప్ప ఆటగాడు రాహుల్ ద్రావిడ్ చెప్పినట్లుగా, కష్టపడి పనిచేసే వారినే అదృష్టం వరిస్తుంది" అని అలీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ గెలుపుతో హైదరాబాద్ రేపు జరిగే ఫైనల్లో పెషావర్ జల్మీతో తలపడనుంది.